రేపటి నుంచి కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన

Andhra Pradesh, Chandrababu, chandrababu kuppam tour, Chandrababu to Tour in Kuppam, Chandrababu to Tour in Kuppam From October 29th, Chandrababu visit Kuppam, Kuppam, Mango News, TDP Chief Chandrababu, TDP Chief Chandrababu Kuppam Tour, TDP Chief Chandrababu to Tour in Kuppam From October 29th, TDP chief Chandrababu visit Kuppam, Turn crisis into stepping stone for success

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అక్టోబర్ 29 నుంచి తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించనున్నారు. రెండు రోజుల ఈ పర్యటనలో భాగంగా 29వ తేదీన కుప్పంలో జరిగే బహిరంగసభలో చంద్రబాబు పాల్గొననున్నారు. అలాగే 30న కుప్పం నియోజకవర్గపరిధిలోని పలు గ్రామాల్లో చంద్రబాబు పర్యటించి పార్టీ శ్రేణులతో, ప్రజలతో మమేకమవనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో కుప్పంలో కూడా పార్టీ కొన్ని చోట్ల ప్రతికూల ఫలితాలను ఎదుర్కున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీపీ కేడర్ లో తిరిగి నూతన ఉత్తేజం నింపడం, స్థానికంగా సమస్యల పరిష్కారం దిశగా ఈ పర్యటన సాగనున్నట్టు తెలుస్తుంది. కుప్పంలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో స్థానిక టీడీపీ నేతలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 8 =