విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఫిబ్రవరి 10 వ తేది నుంచి ఆమరణ దీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పల్లా శ్రీనివాసరావు ఆరోగ్యం క్షిణిస్తుండంతో, సోమవారం రాత్రి ఆయన దీక్షను పోలీసులు భగ్నం చేసి నగరంలోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో విశాఖపట్నం చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసుపత్రికి వెళ్లి పల్లా శ్రీనివాసరావును పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
కాగా విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కు తీసుకునేంతవరకు దీక్షను కొనసాగిస్తానని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు వెంట టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఇతర పార్టీ నాయకులు ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ