తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి నుంచి మూడు రోజుల పాటుగా గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నేడు గుంటూరు జిల్లా పొన్నూరులో, రేపు బాపట్లలో, ఎల్లుండి చీరాలలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పొన్నూరు నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర, పార్టీ నేత తెనాలి శ్రావణ్ కుమార్ సహా పలువురు నాయకులు ఏర్పాట్లను పరిశీలించారు. చంద్రబాబు పర్యటనను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని విజయవంతం చేసేలా బైక్ ర్యాలీలు, రోడ్ షో, బహిరంగ సభలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేశారు,
ముందుగా గురువారం మధ్యాహ్నం ఉండవల్లి నివాసం నుంచి చంద్రబాబు భారీ రోడ్ షో తో రాత్రికి పొన్నూరు చేరుకోనున్నారు. నారా కోడూరులో రైతులతో చంద్రబాబు సమావేశంతో పాటుగా, పొన్నూరు బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొననున్నారు. గురువారం రాత్రికి పొన్నూరులోనే చంద్రబాబు బస చేయనున్నారు.
డిసెంబర్ 9న బాపట్లలో పర్యటన:
- బాపట్ల టౌన్ లో రోడ్ షో నిర్వహిణ,
- అనంతరం బాపట్లలో బహిరంగ సభ
- బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో బస
డిసెంబర్ 10న చీరాలలో పర్యటన:
- ముందుగా బాపట్ల జిల్లా చీరాలలో రోడ్ షో నిర్వహణ
- అనంతరం చీరాలలో బహిరంగ సభ
- ముస్లిం నేతలతో చంద్రబాబు సమావేశం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE