విశాఖపట్నం జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు ఆగస్టు 28, శుక్రవారం నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పంచకర్ల రమేష్బాబు పార్టీలో చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ముందుగా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్, వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రమేష్బాబు మాట్లాడుతూ, ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖను టీడీపీ వ్యతిరేకించినపుడు, ఐదు నెలల క్రితమే టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేశానని చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణపై సీఎం వైఎస్ జగన్ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలంతా స్వాగతించారని అన్నారు. అన్ని వర్గాలకు సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, ఉత్తరాంధ్ర ప్రాంతానికి మంచి రోజులు వచ్చాయని చెప్పారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu