ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. 14 రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉండమని డాక్టర్ సూచించారు. ఈ 14 రోజులు రాజకీయలకు దూరంగా ఉంటాను. నాకు దైవ సమానులైన మా అధినేత చంద్రబాబు నాయుడు గారు, అభిమానుల ఆశీస్సులతో కోవిడ్ ని జయించి, త్వరలోనే తిరిగి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటాను” అని బుద్దా వెంకన్న ట్విట్టర్ లో పేర్కొన్నారు. మరోవైపు ఏపీలో ఆగస్టు 27 నాటికీ మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,93,090 కు చేరింది. నమోదైన మొత్తం కేసుల్లో 2,95,248 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడగా, ప్రస్తుతం ఆసుపత్రుల్లో మరియు కోవిడ్ కేర్ సెంటర్స్ లో మొత్తం 94209 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu