ప్రచారాలలో కలిసి నడుస్తున్న కూటమి

TDP Jana Sena And BJP Alliance Running Together, YCP, TDP, Janasena, Chandrababu, Jagan, Pawan Kalyan, Election, BJP Alliance, Jana Sena And BJP Alliance, Alliance, Andhra Pradesh Elections, AP Political News, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
YCP, TDP, Janasena, Chandrababu, Jagan, Pawan Kalyan, election,BJP alliance

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల పండుగకు కౌంట్ డౌన్ మొద‌లైంది. మ‌న పాల‌కుల‌ను ఎన్నుకునే స‌మ‌యం వ‌చ్చింది. ఐదేళ్ల పాటు మ‌న భ‌విష్య‌త్తును మ‌న‌మే రాసుకునేందుకు వేళైంది. అయితే జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేకంగా ఉన్న ప్ర‌జ‌లు జ‌న‌సేన‌, బీజేపీ, టీడీపీ కూట‌మి వైపు ఆక‌ర్షితుల‌వుతున్నారన్న టాక్ నడుస్తోంది. మ‌రోవైపు ఎన్నిక‌ల నామినేషన్ల హడావుడికి రంగం సిద్ధం అయింది.

ప్ర‌జ‌ల ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు కోసం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పొత్తుల‌తో మొద‌టి అడుగువేశారు. ఇక వైసీపీని గ‌ద్దె దించాల‌నే ల‌క్ష్యం ఒక‌టే మిగిలి ఉందన్న కసితో కూటమి పావులు కదుపుతోంది. వైసీపీ ప్ర‌భుత్వ పాల‌న‌లో వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళుతోంది. స్థానికంగా ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కోసం ఎన్డీయే కూట‌మి అభ్య‌ర్థిని గెలిపించాల‌నే ప్ర‌చారాన్ని వేగ‌వంతం చేసింది. అందుకే ప్రతీ చోట వైసీపీ అభ్య‌ర్థి కంటే జ‌న‌సేన కూట‌మి అభ్య‌ర్థి బెట‌ర్ అనేలా ప్ర‌జ‌ల్లో చ‌ర్చ జ‌రిగేలా ఏపీ వాతావరణం మారిపోయింది. జ‌గ‌న్‌కు ఓటు వేస్తే రాష్ట్రం అప్పుల‌పాల‌వుతుందన్న భయం ఏపీ వాసులకు పెరిగింది.

పొత్తులు అంటే పార్టీల్లో అసంతృప్తులు ఉండ‌టం స‌హ‌జం.. కాని ప్ర‌జ‌ల భ‌విష్య‌త్తు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధి ముందు.. ఈ అసంతృప్తులు లెక్కే కాదు. వైసీపీ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌లు అసంతృప్తితో ఉన్నారు. వారిని తృప్తి ప‌ర్చేది జ‌న‌సేన కూట‌మే అని ప్ర‌జ‌లు బ‌లంగా న‌మ్ముతున్నారు. ప‌వ‌న్‌పై ప్ర‌జ‌ల్లో ఉన్న విశ్వాస‌మే కూట‌మిపై న‌మ్మ‌కం క‌లిగేలా చేస్తుంది.

జ‌న‌సేన పోటీచేసే అన్ని స్థానాల్లో అభ్య‌ర్థుల‌ను గెలిపించాల్సిన బాధ్య‌త కూట‌మిలో పార్టీల‌దే కాబట్టి అంతా కలిసి అడుగులు వేస్తున్నారు. జ‌న‌సైనికులంతా కూట‌మిలో పార్టీల కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌తో క‌లిసిపోయి..కూటమి అభ్య‌ర్థిని గెలిపించ‌డ‌మే మ‌న ముందున్న ల‌క్ష్యంగా పెట్టుకుంటున్నారు. నిమిషం కూడా వృధా కాకుండా.. ఎక్కువ సార్లు ఓట‌ర్ల‌ను క‌లిసి ఓట్ల‌ను అభ్య‌ర్థించే పనిలో బిజీ అయిపోతున్నారు.

జిల్లా స్థాయి, రాష్ట్ర‌స్థాయి నాయ‌కులు వ‌చ్చి ప్ర‌చారం చేస్తే జెండా ప‌ట్టుకుని వెళ్లాల‌నే ఆలోచ‌నను పక్కన పెట్టి జనసేన, టీడీపీ కార్యకర్తలు కూడా జనాల్లో మమేకం అవుతున్నారు. గుంపులుగా గుంపులుగా జ‌నం ఉంటేనే ప్ర‌చారం అని కాకుండా.. బూతు స్థాయిలో స్థానిక నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఓట‌ర్ల‌ను ప్ర‌తి రోజు క‌లిసి వైసీపీ వైఫల్యాలను వివరిస్తున్నారు. కూట‌మికి ఓటు వేయాల‌ని అభ్య‌ర్థిస్తూ ఓటర్లను ఆకట్టుకోవడంలో ముందే ఉంటున్నారు. ఏది ఏమయినా ఓటర్ల పల్స్ ను పట్టుకోవడం ఎవరి తరం కాదు కాబట్టి.. ఏపీలో ప్రజలు ఎవరికి పట్టం కడతారో తెలుసుకోవడానికి కొద్ది రోజులు ఆగాల్సిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 4 =