టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాను మంగళవారం అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుగా బుధవారం ఉదయం దేవినేని ఉమాను నందివాడ పోలీస్స్టేషన్ కు తీసుకెళ్ళగా, అనంతరం అక్కడ నుంచి భారీ భద్రత మధ్య హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో హనుమాన్ జంక్షన్ నుంచి వర్చువల్ విధానం ద్వారా దేవినేని ఉమాను మైలవరం కోర్టు జడ్జి ముందు పోలీసులు హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14 రోజుల పాటుగా రిమాండ్ విధించింది. అలాగే ఆయన్ను రాజమహేంద్రవరం జైలుకు తరలించాలని ఆదేశాలు ఇచ్చారు. మంగళవారం నాడు కృష్ణా జిల్లా కొండపల్లి అటవీప్రాంతంలో పర్యటన, అనంతరం జి.కొండూరు మండలం గడ్డమణుగు గ్రామం వద్ద చోటుచేసుకున్న ఘటనలో దేవినేని ఉమాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ తో పాటుగా మొత్తంగా 12 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ