మచిలీపట్నం వైస్సార్సీపీ నేత మోకా భాస్కర్రావు హత్య కేసులో టీడీపీ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టై రిమాండులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆగస్టు 25, మంగళవారం నాడు మచిలీపట్నం కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 28 రోజుల పాటు విజయవాడలోనే ఉండాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. బెయిల్ మంజూరు కావడంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బుధవారం ఉదయం కొల్లు రవీంద్ర విడుదలయ్యారు. మోకా భాస్కర్రావు హత్య కేసులో ఏ-4 నిందితునిగా ఉన్న కొల్లు రవీంద్ర 53 రోజులు తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu