ఘోర రోడ్డు ప్రమాదం: ఢీకొన్న రెండు బస్సులు, ఆరుగురు మృతి

UPSRTC Bus Accident, UPSRTC bus meets with an accident, UPSRTC Buses Accident Near Lucknow, upsrtc scania bus accident, uttar pradesh accident today, uttar pradesh bus accident, uttar pradesh bus accident today, Uttar Pradesh State Road Transport Corporation

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో లక్నో నగర శివార్లలోని కకోరి ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం కకోరి ప్రాంతంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన రెండు బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా, వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. రెండు బస్సుల్లో కలిపి 25 మందికి పైగానే ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఒక బస్సు ముందుగా వెళ్తున్న ఓ ట్రక్కును అధిగమించే ప్రయత్నంలోనే ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకోట్టినట్టు ప్రాథమికంగా తెలుస్తుందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్పందిస్తూ, . గాయపడిన వారికీ మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 9 =