ప్రత్యేక హోదా పై రాజీనామాలకు మేము సిద్ధమని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మంగళగిరిలోని టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన ఈ విధంగా స్పందించారు. ప్రత్యేక హోదా, రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్, విభజన హామీల వంటి వివిధ అంశాల్లో రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టారు. విశాఖ రైల్వే జోన్ సాధించే విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అయన ఆరోపించారు. చివరికి ఆంధ్రాకి గర్వకారణమైన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను కూడా అడ్డుకోకలేకపాయిందని దుయ్యబట్టారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాణాధారమైన పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. సీఎం వైఎస్ జగన్ ఈ అంశాలన్నింటిపై స్పందించాలని ఆయన కోరారు. అవసరమైతే తమ పార్టీ ఎంపీలు రాజీనామాలకు సిద్ధమని సంచలనాత్మక ప్రకటన చేసారు. రాజీనామాలకు మీరు సిద్ధమా అని అధికారపక్ష పార్టీకి సవాల్ విసిరారు. మీరు కూడా కలిసివస్తే, అందరం కలిసి పోరాడి విభజన హామీలను సాధించవచ్చని సూచించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపట్ల చంద్రబాబు తీవ్ర అసహనం చేసారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ