‘అమరావతి పరిరక్షణ’ ఉద్యమానికి టీడీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ‘అమరావతి’నే కొనసాగించాలంటూ ఉద్యమం చేస్తున్న ఆప్రాంత రైతులకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఈ ఉద్యమం ప్రారంభమై 800 రోజులు అయిన సందర్భంగా ఈరోజు (గురువారం) ఆయన మీడియాతో మాట్లాడారు. ‘అమరావతి పరిరక్షణ ఉద్యమం’ రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. రాజధాని కోసం రైతుల చేస్తున్న ఈ పోరాటానికి టీడీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. ఇక్కడి రైతుల ఉద్యమ స్ఫూర్తిని చూసైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనసు మార్చుకోవాలని సూచించారు. ఆచరణ సాధ్యం కాని మూడు రాజధానుల ప్రతిపాదనను విరమించుకుని రాష్ట్ర రాజధానిగా అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ