త్వరలో ప్రజాచైతన్య యాత్ర చేయనున్న చంద్రబాబు

Andhra Pradesh, AP 3 Capitals Bill, AP 3 Capitals Issue, Chandrababu, Chandrababu Naidu, Chandrababu Naidu Bus Yatra, Chandrababu Naidu Bus Yatra Live, Chandrababu Naidu Praja Chaitanya Yatra, Mango News Telugu, Praja Chaitanya Bus Yatra, Praja Chaitanya Yatra, TDP, tdp bus yatra, TDP President Chandrababu
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో రాష్ట్రంలో ప్రజాచైతన్య యాత్ర చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేలా ప్రజాచైతన్య యాత్ర పేరుతో బస్సు యాత్ర చేపట్టేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఫిబ్రవరి 17 నుంచి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రజాచైతన్య యాత్ర చేపట్టే అవకాశం ఉంది. ఈ యాత్ర సుమారు 45 రోజులపాటు కొనసాగనుంది.
ఈ బస్సు యాత్రలో మూడు రాజధానుల అంశం, పెట్టుబడులు విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, ఇతర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేలా టీడీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. చంద్ర బాబు బస్సు యాత్రను ఏ ప్రాంతం నుంచి ప్రారంభిస్తారనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అలాగే మరో మూడు రోజుల్లో బస్సు యాత్ర రూట్‌ మ్యాప్‌ ఖరారు కానుంది. టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ లు, కీలక నాయకుల ఆధ్వర్యంలో ఈ బస్సు యాత్ర నిర్వహించనున్నారు.

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =