జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రశంసలు కురిపించారు. కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు 21 రోజుల లాక్డౌన్ విధించిన నేపథ్యంలో చెన్నై హార్బర్లో శ్రీకాకుళం మత్స్యకారులు చిక్కుకుపోయి వసతి, భోజన సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, వారికి తగు సదుపాయాలు కల్పించాలని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి విజ్జప్తి చేస్తూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి పై తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి తక్షణమే స్పందిస్తూ శ్రీకాకుళం మత్స్యకారులను ఆదుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు వెంటనే మత్స్యకారులకు తగిన సదుపాయాలను కల్పించారు. ఈ నేపథ్యంలో మత్స్యకారుల ఇబ్బందులను పరిష్కరించడానికి తన వంతు పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ ను, అందుకు వెంటనే స్పందించిన తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిని అభినందిస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్వీట్ చేశారు. మంచి ప్రయత్నాలకు దేవుడు ఎప్పుడూ సహకరించి ఆశీస్సులు అందజేస్తాడని ఆమె పేర్కొన్నారు.
@PawanKalyan garu your efforts to voice the sufferings of AP fishermen from Srikakulam District stranded in Chennai harbour area due #lockdown for corona virus threat with @CMOTamilNadu and his prompt response to help them both laudable good will gestures.God bless your efforts
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) March 30, 2020
I am humbled by your message Madam Governor Hon.@DrTamilisaiGuv ; your kind message encourages me to stand by helpless people more in the future. I would like convey my heartfelt thanks to @CMOTamilNadu through you.🙏🙏🙏 https://t.co/RNblQnbTo8
— Pawan Kalyan (@PawanKalyan) March 30, 2020
ఈ అంశానికి సంబంధించిన మరికొన్ని వార్తలు:
గ్రామ వాలంటీర్లు ఈ సమయంలో కీలక పాత్ర పోషించాలి – పవన్ కళ్యాణ్
కరోనా వైరస్ వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలి – పవన్ కళ్యాణ్
కరోనా ఎఫెక్ట్: తన పుట్టిన రోజు వేడుకలు జరపవద్దన్న రామ్ చరణ్
[subscribe]