కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులు కొంతమంది హైదరాబాద్లోనే ఉండిపోయారు. రెండు రాష్ట్రాల్లో లాక్డౌన్ అమలులో సడలింపులు ఇచ్చిన ఇచ్చిన నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్న 400 మంది ఏపీ సచివాలయ ఉద్యోగులను రాష్ట్రానికి వచ్చేలా అనుమతివ్వాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్కు లేఖ రాశారు. దీంతో సచివాలయ ఉద్యోగులకు హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ముందుగా 250 మంది ఉద్యోగులను తరలించేందుకు ఏపీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. ఎల్బీనగర్, మియాపూర్, కేపీహెచ్బీ నుంచి ఈ బస్సులు ఏపీకి బయల్దేరనున్నాయి. కొంత విరామం తర్వాత పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమైన నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శిని సచివాలయ ఉద్యోగుల సంఘం కోరడంతో హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చే ఉద్యోగులతో పాటుగా మిగిలిన వారికీ కూడా త్వరలోనే కరోనా పరీక్షలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu