ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 2783 కరోనా పాజిటివ్ కేసులు, 14 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో అక్టోబర్ 31, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,23,348 కు చేరగా, కరోనా వలన మరణించిన వారి సంఖ్య 6690 కి పెరిగింది. మరో 3708 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. కాగా గడిచిన 24 గంటల్లో 82,045 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించారు. కరోనా వలన చిత్తూరులో ముగ్గురు, కృష్ణాలో ముగ్గురు, గుంటూరులో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఇద్దరు, అనంతపూర్ లో ఒకరు మరియు తూర్పుగోదావరిలో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 6690 కి చేరింది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (అక్టోబర్ 31, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం పరీక్షలు: 80,28,905
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 8,23,348
- కొత్తగా నమోదైనా కేసులు : 2783
- నమోదైన మరణాలు : 14
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 7,92,083
- యాక్టీవ్ కేసులు : 24575
- మొత్తం మరణాల సంఖ్య : 6690
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ