గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఓ ఉన్మాది చేతిలో బలైన అనూష కుటుంబాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం పరామర్శించనున్నారు. ఉదయం 9 గంటలకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుని, అనంతరం రోడ్డు మార్గంలో 11 గంటలకు నారా లోకేష్ నరసరావుపేట చేరుకుంటారని, అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని టీడీపీ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే లోకేష్ నరసరావు పేట పర్యటనకు అనుమతి లేదని పోలీసు అధికారులతో ప్రకటించడంతో స్థానికంగా ఉత్కంఠ నెలకొంది. గుంటూరు జిల్లాలో పలువురు టీడీపీ నేతలను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. పర్యటనకు అనుమతి లేకపోవడంతోనే శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగానే చర్యలు తీసుకుంటున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. మరోవైపు హైదరాబాద్ నుండి నారా లోకేష్, టీడీపీ నేతలు గన్నవరంకు బయలుదేరగా, ఆయన్ను ఎయిర్ పోర్ట్ వద్దనే అడ్డుకునేందుకు పోలీసులు బందోబస్తు చేసినట్టుగా తెలుస్తుంది.
ముందుగా నారా లోకేష్ నరసరావుపేట పర్యటనకు అనుమతి లేదని గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ బుధవారం ప్రకటించారు. ఫిబ్రవరి 24న అనూష హత్య జరిగితే 24 గంటల్లో నిందితుడని అరెస్ట్ చేశామని, కుటుంబానికి కూడా ప్రభుత్వ పరిహారం అందజేశారని చెప్పారు. ఈ కేసులో చార్జ్ షీట్ దాఖలు కాగా, కేసు ట్రయల్ కు కూడా వచ్చిందన్నారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలోనే నారా లోకేష్ పర్యటనకు అనుమతి లేదని ఎస్పీ విశాల్ గున్నీ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ