సిరిసిల్ల పట్టణంలో గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో వరద నీరు వచ్చి కాలనీల్లో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిరిసిల్లలో జలమయమైన పలు కాలనీలలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరద బాధిత కుటుంబాలతో మాట్లాడి వారికీ వెంటనే నిత్యావసర సరకులు, పరిహారం అందజేయడంపై అధికారులను ఆదేశించారు. అలాగే రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ విభాగాల ఆధ్వర్యంలో జరుగుతున్న సహాయక చర్యలను మంత్రి కేటీఆర్ పర్యవేక్షించారు.
మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాల వల్ల కలిగిన నష్టంపై జిల్లా కలెక్టర్ మరియు అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వరదల వలన ముంపుకు గురైన ప్రాంతాల పరిస్థితిని, పునరావాస ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో వరదలు వచ్చిన ఎలాంటి నష్టం కలగకుండా చేపట్టాల్సిన చర్యలపై సమీక్షలో చర్చించారు. వారం రోజుల్లో జిల్లాలో పంట నష్టానికి సంబంధించి నివేదిక సమర్పించాలని అధికారులును మంత్రి కేటీఆర్ ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ