తెలుగు దేశం పార్టీ మూడో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇప్పటి వరకు రెండు విడతలుగా అభ్యర్థుల జాబితాను ప్రకటించగా.. శుక్రవారం మూడో అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించింది. అలాగే 13 ఎంపీ స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేసింది. పొత్తులో భాగంగా ఈసారి 144 అసెంబ్లీ.. 17 లోక్ సభ స్థానాల్లో తెలుగు దేశం పార్టీ పోటీ చేస్తోంది. ఇప్పటి వరకు 139 అసెంబ్లీ స్థానాలకు.. 11 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. 5 అసెంబ్లీ.. 6 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.
11 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు వీరే..
పలాస- గౌతు శిరీష
పాతపట్నం-మామిడి గోవింద్ రావు
శ్రీకాకుళం-గొండు శంకర్
శృంగవరపుకోట-కోళ్ల లలితా కుమారి
కాకినాడ సిటీ- వనమాడి వెంకటేశ్వర రావు
అమలాపురం- అయితాబత్తుల ఆనంద రావు
పెనమలూరు- బోడె ప్రసాద్
మైలవరం- వసంత వెంకటకృష్ణ ప్రసాద్
నరసరావుపేట-డాక్టర్ చదలవాడి అరవింద్ బాబు
చీరాల – మద్దులూరి మాలకొండయ్య యాదవ్
సర్వేపల్లి- సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులు వీరే..
శ్రీకాకుళం-కింజరాపు రామ్మోహన్ నాయుడు
విశాఖపట్నం-మాత్కుమిల్లి భరత్
అమలాపురం- గంటి హరీష్ యాదవ్
ఏలూరు-పుట్టా మహేష్ యాదవ్
విజయవాడ-కేశినేని శివనాధ్
గుంటూరు-పెమ్మసాని చంద్రశేఖర్
నరసరావుపేట-లావు శ్రీకృష్ణదేవరాయలు
బాపట్ల-కృష్ణప్రసాద్
నెల్లూరు-వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
చిత్తూరు-దగ్గుమళ్ల ప్రసాద్ రావు
కర్నూల్-బస్తిపాటి నాగరాజు
నంద్యాల-బైరెడ్డి శబరి
హిందూపూర్-బీకే పార్థసారధి
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE