బుచ్చయ్య చౌదరిని బుజ్జగిస్తారా?

Rajahmundry Rural,CM Jagan, YCP, TDP, Janasena, Chandrababu, Pawan Kalyan, Gorantla Butchayya Chaudhary,Kandula Durgesh,Andhra Pradesh News Updates, AP Political News, AP Politics, AP Elections,Mango News Telugu,Mango News
Rajahmundry Rural,CM Jagan, YCP, TDP, Janasena, Chandrababu, Pawan Kalyan, Gorantla Butchayya Chaudhary

రాజమండ్రి రూరల్ అంటేనే టీడీపీకి కంచుకోటగా అందరూ చెప్పుకుంటారు. రాజమండ్రి  రూరల్ నియోజకవర్గంగా ఆవిర్భవించిన తరువాత తెలుగు దేశం పార్టీ ఒక్కసారి కూడా ఓడిపోని స్థానం ఏదైనా ఉందా అంటే.. అది ఇదే. ఇప్పటివరకు మూడు ఎన్నికలు జరుగగా..అన్ని ఎన్నికలలో కూడా పసుపు జెండానే  రెపరెపలాడింది. ఇక ముందు కూడా అదే పరిస్థితి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతూ ఉంటారు.

2009 లో జరిగిన ఎన్నికలలో , 2014లో జరిగిన ఎన్నికలలో, 2019లో జరిగిన ఎన్నికల్లో కూడా టీడీపీ గెలిచి హ్యాట్రిక్ కొట్టింది. 2009లో చందన రమేష్ గెలుపొందగా.. ఆ తరువాత జరిగిన రెండు ఎన్నికల్లో కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు. 2019లో  వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనాన్నికూడా తట్టుకుని.. టీడీపీ కైవసం చేసుకున్న నియోజకవర్గాల్లో రాజమండ్రి రూరల్ ఒకటి.కానీ ఈ ఎన్నికలలో ఈ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ చేజారడం ఖాయం అయిపోయింది.

టీడీపీతో జనసేన పొత్తులో ఉండటంతో.. రాజమండ్రి రూరల్ స్థానంపై జనసేన కర్చీఫ్ వేసింది. జనసేన పార్టీ సీనియర్ నాయకుడు కందుల దుర్గేష్.. రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయడం ఖరారైంది.   కందుల దుర్గేష్ పేరును జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఖరారు చేసేశారు.తాజాగా  ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నాయకులతో జనసేనాని సమావేశం అయ్యారు. రాజమండ్రి రూరల్, రాజమండ్రి అర్బన్, రాజానగరం, అనపర్తి నియోజకవర్గాల ముఖ్య నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక రాజకీయాల గురించి ఆరా తీశారు.ఆ సమయంలో రాజమండ్రి రూరల్‌కు దుర్గేష్ పేరును పవన్ ఖరారు చేశారు.

కందుల దుర్గేష్ సొంత నియోజకవర్గం రాజమండ్రి రూరల్ కాబట్టి..అక్కడ దుర్గేష్‌ను నిలబెడితే జనసేన గెలిచే అవకాశాలున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. 2019 ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నుంచి జనసేన తరపున పోటీ చేసిన కందుల  కందుల దుర్గేష్.. 42 వేలకు పైగా ఓట్లను సాధించారు. అప్పుడు జనసేనకు అక్కడ 22 శాతానికి పైగా ఓట్లు పోల్ అయ్యాయి.అయితే టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా ఇప్పుడిదే స్థానం నుంచి కందుల దుర్గేష్ మరోసారి పోటీ చేయబోనుండటం  అక్కడ ప్రాధాన్యతను సంతరించుకుంది.

జనసేన తరపున కందుల దుర్గేష్ ఓకే ..కానీ ఎప్పటి నుంచో ఈ నియోజకవర్గానికి తెలుగు దేశం పార్టీ తరఫున ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి పరిస్థితేమిటనేదే  ఇప్పుడు టాక్ ఆఫ్ ది రాజమండ్రిగా మారింది. రెండు సార్లు ఇక్కడి నుంచి గెలిచిన గోరంట్ల బుచ్చయ్యకు ఇప్పుడు చంద్రబాబు సీటును ఎలా సర్దుబాటు చేస్తారు? ఒకవేళ ఎక్కడైనా సీటు ఇస్తే గోరంట్ల ఒప్పుకుంటారా? ఒకవేళ అదీ లేకపోతే గోరంట్లను ఎలా బుజ్జగిస్తారు? కందుల దుర్గేష్‌  గెలుపు కోసం గోరంట్ల బుచ్చయ్య చౌదరి పని చేస్తారా? లేదా?   ఈ ప్రశ్నలే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =