ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘ఎన్టీఆర్’ పేరుతో కొత్త జిల్లా ఏర్పాటుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని దర్శకనిర్మాత వై.విఎస్ చౌదరి అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘మహానుభావులు తమ జీవన విధానాల ద్వారా తమ ఆశయాల సాధన ద్వారా మనలో మహత్తరమైన స్ఫూర్తిని నింపి వెళ్తుంటారు. అటువంటి మహనీయుల్లో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, తెలుగు వారంతా అభిమానంగా పిలుచుకునే ‘అన్న’ స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారు అగ్రగణ్యులు.
జానపద, చారిత్రాత్మక పౌరాణిక, సాంఘిక చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రల ద్వారా తెలుగు సినిమాను విశ్వవిఖ్యాతం చేశారు. ఆత్మగౌరవ నినాదంతో తెలుగుజాతిలో చైతన్యాన్ని నింపారు. బహుముఖ ప్రజ్ఞ పాటవాలతో తాను ఎంచుకున్న అన్ని రంగాల్లో ఆఖండ విజయాల్ని నమోదు చేయడం ద్వారా తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ చెరగని ముద్రవేస్తూ ఓ కారణజన్ముడిగా, యుగపురుషుడిగా అవతరించారు. అటువంటి మహాపురుషుని నుంచి స్ఫూర్తిని పొందినందుకు ప్రతిగా మన తెలుగు రాష్ట్రాల్లోని రెండు జిల్లాలకు ఆయన పేరు మీద నామకరణం చేసుకుని కృతజ్ఞతలు తెలుపుకోవడం మన బాధ్యత.
అలాగే, ఆ మహానుభావుడికి ‘భారతరత్న’ పురస్కారాన్ని ప్రదానం చేయాలనీ ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాక తెలుగు ప్రజల యొక్క అభిమతం మరియు ఆకాంక్ష అని చౌదరి అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ ముఖ్య కేంద్రంగా ‘ఎన్టిఆర్’ జిల్లా పేరుతో ఒక కొత్త జిల్లాని ఏర్పాటు చేసే నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నాను. హర్షాతిరేకాన్ని వ్యక్తపరుస్తున్నాను అని చౌదరి తన స్పందనని తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ