తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్ చెప్పింది. గతేడాది భారీవర్షాల కారణంగా స్వామివారి దర్శనం నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో, దర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులు నిరాశకు లోనయ్యారు. ఈ నేపథ్యంలో.. అప్పుడు స్వామి వారి దర్శనం చేసుకోని వారు మళ్లీ ఇప్పుడు దర్శనం చేసుకోవచ్చని టీటీడీ శుభవార్త చెప్పింది. ఈ మేరకు, శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. నవంబరు 18 నుంచి డిసెంబరు 10వ తేదీ మధ్య.. టికెట్లు కలిగి ఉండి దర్శనం చేసుకోలేకపోయిన భక్తులు ఆరు నెలల్లోపు స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం కల్పించింది.
అయితే, తిరుమలలో జనవరి 13 నుండి 22వ తేదీ వరకు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల సందర్భంగా.. ఆ టికెట్లపై అనుమతి ఉండదని ప్రకటించింది. వైకుంఠ ద్వార దర్శనం కారణంగా ఈ తేదీలు మినహాయించి.. వారు మరి ఏ ఇతర తేదీల్లోనైనా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. కనుక, భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ మేరకు టీటీడీ ప్రజాసంబంధాల అధికారి ప్రకటన విడుదల చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ