‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ [ప్రముఖ నటుడు, మెగా పవర్ స్టార్ రామ్చరణ్కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్తో పాటు ఒకే వేదికను పంచుకోనున్నారు. ఈ మేరకు ప్రముఖ న్యూస్ ఛానల్ ఇండియా టుడే ఆధ్వర్యంలో ఢిల్లీలో జరుగుతున్న ఒక సదస్సులో పాల్గొనడానికి రామ్చరణ్కు ఆహ్వానం అందింది. శుక్రవారం రాత్రికి జరుగనున్న ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, సచిన్ టెండూల్కర్ సహా రామ్చరణ్ ప్రసంగించనున్నారు. అలాగే ఈ కార్యక్రమం అనంతరం రామ్చరణ్ ప్రత్యేకంగా ప్రధాని మోదీని కలువనున్నారు. ఈ సందర్భంగా ఇటీవల ఆస్కార్ వంటి ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటలో చక్కని అభినయం ప్రదర్శించింనందుకు ఆయనను ప్రధాని సత్కరించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఆస్కార్ వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన రామ్చరణ్, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తన సతీమణి ఉపాసనతో కలిసి ఈరోజు ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE