వైఎస్ షర్మిల ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి ఓ ఇంటివాడుకాబోతున్నాడు. తన ప్రియురాలు అట్లూరి ప్రియను రాజారెడ్డి ఫిబ్రవరి 17న పెళ్లి చేసుకోబోతున్నాడు. జనవరి 18న హైదరాబాద్లో వీరి నిశ్చితార్థం జరగనుంది. ఇప్పటికే షర్మిల ఇంట్లో పెళ్లి సందడి మొదలయింది. పెద్ద ఎత్తున ఇప్పటి నుంచే పెళ్లి, నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే షర్మిల కుమారుడి పెళ్లికి ఆమె సోదరుడు, సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరవుతారా..? లేదా..? అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
షర్మిల, జగన్ మధ్య విభేదాలు రావడంతో ఇద్దరూ విడిపోయి తలోదారి చూసుకున్నారు. షర్మిల తెలంగాణకు వెళ్లి వైఎస్సార్టీపీ పార్టీని స్థాపించారు. చివరికి ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. త్వరలో ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేజిక్కించుకోబోతున్నారు. ఎన్నికలవేళ సొంత అన్నపైనే పోరాడబోతున్నారు. అయితే ఎన్నికలకంటే ముందుగానే షర్మిల కొడుకు రాజారెడ్డి పెళ్లి జరగనుంది. ఇప్పటికే పలువురు ప్రముఖులకు షర్మిల తన కొడుకు పెళ్లికి రావాలంటూ ఆహ్వానాలు పంపించింది.
ఇటీవల కొడుకు, కోడలుతో కలిసి ఇడుపుల పాయకు వెళ్లిన షర్మిల.. తొలికార్డును తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద పెట్టింది. ఆ తర్వాత తన అన్న జగన్మోహన్ రెడ్డిని కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేసింది. పెళ్లికి, నిశ్చితార్థానికి హాజరు కావాలని అన్న, వదినలను కోరింది. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ.. ఆ తర్వాత జగన్ ప్రత్యర్థులను కలిసి షర్మిల ఆహ్వానం పలకడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మరికొంత మంది ప్రత్యర్థులను షర్మిల కలిసి కొడుకు పెళ్లికి ఆహ్వానం పలికింది.
అంతేకాకుండా క్రిస్మస్ సందర్భంగా టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్కు షర్మిల బహుమతి పంపించారు. ఇప్పుడు పెళ్లికి కూడా చంద్రబాబు నాయుడును, నారా లోకేష్ను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ వీరంతా పెళ్లికి హాజరవుతే ఒకే వేదికపై ప్రత్యర్థులతో కలిసి జగన్మోహన్ రెడ్డి కనిపించనున్నారు. ఈక్రమంలో జగన్మోహన్ రెడ్డి మేనల్లుడి కోసమైనా పెళ్లికి వెళ్తారా..? లేదా..? అన్నది ఆసక్తికరంగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE