మోడీ, అమిత్ షా ను సంప్రదించాకే నిర్ణయాలు

amaravati latest news, AP Latest Political News, Ap Political Live Updates, Ap Political Live Updates 2019, Mango News, MP Vijayasai Reddy Comments On Amaravati, Vijayasai Reddy Comments On Amaravati, YCP MP Vijayasai Reddy Comments On Amaravati, YCP MP Vijayasai Reddy To Meet PM Modi, YCP MP Vijayasai Reddy To Modi

వైసీపీ పార్టీ ముఖ్య నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డి ఈ రోజు ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా ప్రధాని నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్ షా ను సంప్రదించాకే తీసుకోవడం జరిగిందని స్పష్టం చేసారు. పోలవరం రివర్స్ టెండరింగ్, పీపీఏల పునఃపరిశీలన వంటి అంశాలలో కూడ ప్రధాని నరేంద్రమోడీతో చర్చించాకే నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఏపీ రాజధానిని మారుస్తున్నాం అని ప్రభుత్వం ఎక్కడా ప్రకటించలేదని, అలాంటపుడు ప్రభుత్వం తీసుకొని నిర్ణయంపై ఇప్పుడు చర్చించడం అనవసరమని చెప్పారు.

ఈ రోజు విజయసాయిరెడ్డి నేతృత్వంలో వైసీపీ ఎంపీలు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ ను కలిశారు. ఆంధ్రప్రదేశ్ లో పెండింగ్ ప్రాజెక్టులకు వెంటనే నిధులు విడుదల చేయాలనీ కోరారు. వాల్తేరు డివిజన్ ను, విశాఖ రైల్వే జోన్లో కొనసాగించాలని మంత్రిని కోరారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, అవినీతిని నిర్ములించే విషయంలో తమ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులు ఉన్నాయని తెలిపారు. టీడీపీ అన్నింటిపై చేసే దుష్ప్రచారాన్ని నమ్మొద్దని, నారా లోకేష్ అవగాహనా లేకుండా ట్వీట్స్ చేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రప్రయోజనాల కోసమే అమెరికాలో పర్యటిస్తున్నారని, కొన్ని వ్యక్తిగత కార్యక్రమాలు ఉన్నా కూడ తప్పు పట్టాల్సిన పనిలేదని అన్నారు.

 

[subscribe]
[youtube_video videoid=imosSlhn1Q]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × five =