నాలుగేళ్ల తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి.. వైఎస్ షర్మిల ఒకే ఫ్రేమ్లో కనిపించారు. 2019 తర్వాత తొలిసారి బహిరంగంగా కలుసుకున్నారు. 2019 ఎన్నికల ప్రచార సమయంలో జగన్, షర్మిల కలిసి కనిపించారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో ఎవరి దారి వారు చూసుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరూ ఒకే ఫ్రేమ్లో కనిపించిన దాఖలాలు లేవు. చివరికి నాలుగేళ్ల తర్వాత షర్మిల కుమారుడు.. వైఎస్ రాజారెడ్డి నిశ్చితార్థ వేడుకలో ఒకే ఫ్రేమ్లో కనిపించారు.
గురువారం రాత్రి హైదరాబాద్లోని గోల్కొండ రిసార్ట్స్లో షర్మిల కొడుకు వైఎస్ రాజారెడ్డి నిశ్చితార్థం అట్లూరి ప్రియతో ఘనంగా జరిగింది. అయితే ముందు నుంచి కూడా తన సోదరుడు వైఎస్ జగన్ను షర్మిల తన కొడుకు నిశ్చితార్థానికి, పెళ్లికి ఆహ్వానిస్తారా..? లేదా..? అని చర్చనీయాంశంగా మారింది. కానీ షర్మిల స్వయంగా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్కు వెళ్లి జగన్, వదిన భారతిని నిశ్చితార్థ వేడుక, పెళ్లికి ఆహ్వానించారు. ఈక్రమంలో షర్మిల ఆహ్వానం పలికినప్పటికే మేనల్లుడి ఫంక్షన్కు జగన్ హాజరవుతారా.. లేదా.. అనేది ఉత్కంఠకరంగా మారింది.
కానీ అటు జగన్ కూడా నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. బంధుమిత్రులను పలకరిస్తూ వేదిక వద్దకు వెళ్లిన జగన్.. పూల బొకే ఇచ్చి మేనల్లుడిని అభినందించారు. అయితే ఇక్కడే ఇంట్రెస్టింగ్ సంఘటన చోటుచేసుకుంది. ఈ సమయంలో ఫ్యామిలీతో కలిసి గ్రూప్ ఫొటోకు జగన్ సిద్ధమయ్యారు. తన సోదరి షర్మిలను ఫొటో కోసం పలుమార్లు జగన్ పిలిచారు. అయితే ఫొటో దిగేందుకు షర్మిల మాత్రం ఆసక్తి చూపలేదు. వెనుకే ఉండిపోయింది. తల్లి విజయమ్మ పిలిచినా కూడా షర్మిల ముందుకు రాలేదు.
చివరికి తన భర్త బ్రదర్ అనిల్.. షర్మిలను చేయి పట్టుకొని ఫొటో దిగేందుకు పిలిచారు. ఆ తర్వాత వచ్చిన షర్మిల జగన్కు దూరంగా ఉండి ఫొటో దిగారు. వేడుకలో కూడా అన్నతో అంటీముట్టనట్లు వ్యవహరించారు. అయితే తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినీ నటుడు మోహన్ బాబు వచ్చినప్పుడు పక్కకే నిలబడి ఫొటో దిగిన షర్మిల.. తన సోదరుడు పిలిచినా రాకుండా.. దూరంగా ఉండి ఫొటో దిగడం చర్చనీయాంశంగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ