ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. బుధవారం అసెంబ్లీ సమావేశాలు చివరి రోజున ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ వర్సిటీగా మారుస్తూ అసెంబ్లీలో జగన్ సర్కార్ సవరణ బిల్లు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం పెట్టిన బిల్లుపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మండిపడింది. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు అందివలనకు దిగాయి. అయినా ప్రభుత్వం వెనకడుగు వేయకుండా బిల్లుని అసెంబ్లీలో ఆమోదించుకుంది. ఇక ఈ క్రమంలో పార్టీలకు అతీతంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయంపై నాయకులు స్పందిస్తున్నారు.
ఈ నేపథ్యంలో.. దీనిపై ఏపీ సీఎం జగన్ సోదరి, వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. పాదయాత్రలో భాగంగా షర్మిల ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ దీనిపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ వర్సిటీగా మార్చడం సరైంది కాదని ఆమె అన్నారు. ఎప్పుడైనా ఒకసారి ఒక పేరు పెడితే తరాల పాటు కొనసాగించినప్పుడే వారికీ మనం గౌరవం ఇచ్చినట్లవుతుంది. అంతేకానీ ఒకసారి పెట్టిన పేరుని తర్వాత మారిస్తే దాని పవిత్రత పోతుంది. ఒక్కోసారి ఒక్కో పేరు పెట్టుకుంటూ పోతుంటే ప్రజలలో కూడా గందరగోళం ఏర్పడుతుంది. అందుకే ఎప్పుడైనా ఒకసారి పెట్టిన దానిని మార్చకూడదు అని షర్మిల వ్యాఖ్యానించారు. ఇక వైఎస్ షర్మిల చేసిన ఈ వ్యాఖ్యలతో టీడీపీకి అనూహ్య మద్దతు దక్కియినట్లైంది. కాగా వైసీపీ మాత్రం ఇప్పటివరకు షర్మిల వ్యాఖ్యలపై స్పందించలేదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY