ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ ఉపఎన్నిక నేపథ్యంలో వైఎస్సార్సీపీ సోమవారం నాడు అభ్యర్థిని ఖరారు చేసింది. పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత పేరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ రోజు సీఎం వైఎస్ జగన్ నుంచి ఆమె బీఫామ్ కూడా అందుకున్నారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కు పోతుల సునీత కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎంపికైన పోతుల సునీత, ఆ పార్టీ విధానాలకు నిరసనగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైస్సార్సీపీలో చేరారు. ఈ క్రమంలో ప్రస్తుత ఉపఎన్నికకు మరోసారి ఆమెనే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేస్తూ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ