తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 207 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో అక్టోబర్ 4, సోమవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,66,753 కి చేరింది. కొత్తగా కరోనాతో ఇద్దరు మరణించడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 3,923 కు పెరిగింది. అలాగే మరో 239 మంది కోలుకోగా, ఇప్పటివరకు రికవరీ అయినవారి 6,58,409 కు చేరుకుంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 61, కరీంనగర్ లో 15, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 14, ఖమ్మంలో 13, రంగారెడ్డిలో 12 నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు (అక్టోబర్ 4, సాయంత్రం 5.30 గంటల వరకు):
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు : 2,65,43,381
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు : 6,66,753
- కొత్తగా నమోదైన కేసులు : 207
- నమోదైన మరణాలు : 2
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 6,58,409
- కరోనా రికవరీ రేటు: 98.74%
- యాక్టీవ్ కేసులు: 4,421
- నమోదైన మొత్తం మరణాల సంఖ్య: 3,923
- కరోనా మరణాల రేటు: 0.58%
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ