ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్సభ ఉపఎన్నికకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ ఎం.గురుమూర్తి సోమవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. నెల్లూరు కలెక్టరేట్ లో కలెక్టర్ చక్రధర్ బాబుకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ముందుగా నామినేషన్ సందర్భంగా వీఆర్సీ కూడలి నుంచి కలెక్టరేట్ వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ ఎం.గురుమూర్తి నామినేషన్ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, రాష్ట్రమంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, నారాయణ స్వామి, మేకపాటి గౌతమ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, కన్నబాబు, కొడాలి నాని, పేర్నినాని సహా జిల్లా ఎమ్మెల్యేలు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
మరోవైపు తిరుపతి లోక్సభ ఉపఎన్నికకు మార్చి 23న నోటిఫికేషన్ విడుదల అయింది. మార్చి 23 నుంచి మార్చి 30 వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల పరిశీలన మార్చి 31న జరగనుండగా, నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 3 ను ఆఖరుతేదీగా నిర్ణయించారు. ఇక ఏప్రిల్ 17వ తేదీన పోలింగ్ నిర్వహించి, మే 2వ తేదీన ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ