ఆంధ్రప్రదేశ్లో చోటుచేసుకున్న ఇటీవలి పరిణామాలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్నిరోజుల కిందట జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ను కలవడం అధికార వైఎస్సార్సీపీలో కొంచెం కలవరం సృష్టించింది. ఇక ఆదివారం జరిగిన జనసేన పీఏసీ సమావేశంలో జనసేన నేత నాదెండ్ల మనోహర్ వైసీపీ నేతలను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార వైసీపీలో ఉన్న కాపు నేతలంతా ఈరోజు రాజమండ్రిలో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమావేశంలో వారు చర్చించబోయే అంశాలపై రాజకీయ వర్గాలలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే పార్టీ వర్గాలనుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి జనసేనాని పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. అటు వైసీపీలోని నేతలు కూడా కూడా దీనిపై మండిపడ్డారు. ఒక పార్టీ అధినేతగా ఉంటూ అభ్యంతరకరంగా పరుష పదజాలాన్ని ఉపయోగించడం పవన్ కళ్యాణ్కు మంచిది కాదంటూ హెచ్చరించారు. అలాగే ఏపీ మహిళా కమిషన్ కూడా ఆయనకు నోటీసులు జారీ చేయడం కూడా తెలిసిందే. ఈ పరిణామాలన్నింటి మధ్య నేడు జరుగుతున్న కాపు నేతల భేటీపై అందరి దృష్టి నెలకొంది. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ, జనసేన కలిస్ పోటీ చేయొచ్చు అనేదానిపై కూడా వీరు దృష్టి సారించనున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్పై విమర్శల దాడి మరింతగా పెంచే అంశాన్ని పరిశీలించనున్నట్లు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE