ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల కోటా ఎన్నికల్లో విజయం సాధించిన 8మంది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సోమవారం ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ మేరకు శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు నూతన ఎమ్మెల్సీలతో ప్రమాణస్వీకారం చేయించారు. కాగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో.. డాక్టర్ ఏ.మధుసూదన్, సిపాయి సుబ్రహ్మణ్యం, నర్తు రామారావు, కుడుపూడి సూర్యనారాయణ, కవురు శ్రీనివాస్, రామసుబ్బారెడ్డి, వంకా రవీంద్రనాథ్, మేరుగు మురళీధర్ తదితరులు ఉన్నారు. కాగా శాసన మండలిలో జరిగిన ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మంత్రులు బూడి ముత్యాల నాయుడు, ధర్మాన ప్రసాదరావు, చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ, మేరుగు నాగార్జున, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, చీఫ్ విప్ ప్రసాద్ రాజు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE