నగరి ఎమ్మెల్యే రోజా తృటిలో విమాన ప్రమాదం నుంచి బయటపడ్డారు. హైదరాబాద్-తిరుపతి ఇండిగో విమానంలో సాంకేతిక లోపం గమనించిన పైలట్ రేణిగుంట విమానాశ్రయంలో విమానాన్ని ల్యాండ్ చేయలేకపోయాడు. విమానాన్ని బెంగళూరుకు మళ్లించి ప్రమాదాన్ని తప్పించాడు. ఈ విమానంలో నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రయాణం చేస్తున్నారు. ఆమెతో పాటు మరో 70 మంది కూడా విమానంలో ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, ప్రమాద ఘటన సమయంలో విమానంలో ఉన్న రోజా ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. అందులో రోజా ఇలా చెప్పారు.. “ఇంకా విమానంలోనే ఉన్నాం. విమానం డోర్స్ ఓపెన్ కావటం లేదు. పైలట్ కు ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదు” అని చెప్పారు. సాంకేతిక సమస్యను సకాలంలో గుర్తించిన పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించటం వలననే ఈ ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ