విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో ఆనస్థీషియా (మత్తు) వైద్య నిపుణుడుగా పనిచేసిన డాక్టర్ కె.సుధాకర్ ఘటనపై మే 22, శుక్రవారం నాడు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ సుధాకర్పై దాడి ఘటనలో ప్రభుత్వం ఇచ్చే నివేదికపై తమకు నమ్మకం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. సుధాకర్ పై దాడి చేసిన పోలీసులపై సీబీఐ కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. ఈ ఘటనపై 8 వారాల్లో విచారణ జరిపి పూర్తీ నివేదిక ఇవ్వాలని సీబీఐకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇది చదవండి: నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ సస్పెన్షన్
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]