టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర గురువారం 55వ రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో నేటి ఉదయం పెనుగొండలో లోకేష్ పాదయాత్రలో భాగంగా కియా పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సెల్ఫీ దిగిన లోకేష్.. ఇది టీడీపీ అధినేత, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు ఘనతంటూ కితాబునిచ్చారు. అలాగే సీఎం జగన్కు సెల్ఫీ చాలెంజ్ విసిరారు లోకేష్. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రానికి చాలా పరిశ్రమలు వచ్చాయని, అయితే ప్రస్తుత సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్కి ఇలాంటి కంపెనీని తీసుకురావాలని కలలో కూడా ఊహించలేరని వ్యాఖ్యానించారు. భారతదేశంలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి పెట్టిన సంస్థ ఇదని, రూ.13వేల కోట్లు పెట్టుబడితో ప్రత్యక్షంగా, పరోక్షంగా 40వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. ఇక ఏపీలోనే అతిపెద్ద సింగిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అని, అలాగే దేశంలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి పెట్టిన సంస్థ కూడా ఇదేనని, ఈ ప్లాంట్ ద్వారా ఏడాదికి నాలుగు లక్షల వాహనాలు తయారవుతున్నాయని వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE