టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 95వ రోజుకి చేరుకుంది. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్ర.. బుధవారం కోడుమూరు నియోజకవర్గ పరిధి నుంచి నందికొట్కూరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో కొద్దిదూరం పాదయాత్ర అనంతరం అల్లూరులో 1200 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. ‘‘జనగళమే యువగళమై మహోజ్వలంగా సాగుతున్న యువగళం పాదయాత్ర ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గం అల్లూరులో 1200 కి.మీ మైలురాయిని చేరుకోవడం ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా హంద్రీనీవా నుంచి మిడుతూరు ఎత్తిపోతల పథకానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించాను. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా మిడుతూరు, కలమండల పాడు, మాదిగుండం, పారమంచాల చెరువులకు నీరు చేరుతుంది. తద్వారా 22వేల ఎకరాలకు సాగునీరు, మిడుతూరు, జూపాడు బంగ్లా మండలాల పరిధిలో దాదాపు 60 వేలమంది ప్రజలకు తాగునీరు అందుతుంది’’ అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE