జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన ఇటీవలి అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించారు. నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంట పొలాల్లోకి వెళ్లి దెబ్బతిన్న పంటలను పరిశీలించి, రైతులతో మాట్లాడటం ద్వారా వారి బాధలను స్వయంగా తెలుసుకున్నారు. ఇక ఈ పర్యటనలో పవన్తో కలిసి జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మరియు జిల్లా స్థానిక నేతలు పలువురు పాల్గొననున్నారు.
ఈ క్రమంలో ముందుగా రాజమండ్రి విమానాశ్రయం చేరుకున్న పవన్ కళ్యాణ్.. అక్కడి నుంచి రాజమండ్రి నగరం – బొమ్మూరు – రాజవోలు మీదుగా రాజమండ్రి రూరల్ నియోజక వర్గంలోని కడియం ఆవ భూములలో దెబ్బ తిన్న పంటలను, అక్కడ వ్యవసాయ భూముల్లో మొలకలు వచ్చిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వేమగిరి, జొన్నాడ, రావులపాలెం, కొత్తపేట మీదుగా అవిడి చేరుకొని పంట నష్టపోయిన రైతులను కలుసుకుని పరామర్శించారు. ఆ తర్వాత పి. గన్నవరం నియోజకవర్గం రాజుపాలెం ప్రాంతానికి వెళ్లి అక్కడి రైతులతో మాట్లాడారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE