గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100 రోజుల పాటు ఆసక్తికరంగా సాగే ఈ షో లో 15 మంది సభ్యులు బిగ్ బాస్ ఇంటిలోకి ఎంటరయ్యారు. నటి హేమ, జర్నలిస్టు జాఫర్, వైల్డ్ కార్డు ఎంట్రీ తమన్నా సింహాద్రి, రోహిణి, అషురెడ్డి, అలీరేజా ఎలిమినేట్ అవ్వగా ఇంటిలో 11 మంది సభ్యులున్నారు. సెప్టెంబర్ 9న ప్రసారమైన బిగ్ బాస్-3 యాభై ఒకటవ ఎపిసోడ్ లో నామినేషన్ పక్రియ కొనసాగింది. ఇంటి కెప్టెన్ బాబాబాస్కర్ ను నామినేషన్స్ నుంచి మినహాయించి, చివరిలో నామినేట్ అయినవారి నుండి ఒకరిని సేవ్ చేసే అవకాశం ఇచ్చారు. శిల్పా చక్రవర్తి, పునర్నవి, మహేష్, హిమజ, రవి, శ్రీముఖి నామినేట్ అవ్వగా, కెప్టెన్ బాబాబాస్కర్ బిగ్ బాస్ ఇచ్చిన ప్రత్యేక అధికారంతో రవిక్రిష్ణను సేవ్ చేస్తారు.
ఎపిసోడ్ 51 (సెప్టెంబర్ 9) హైలైట్స్: కొనసాగిన నామినేషన్ పక్రియ, రవికృష్ణ ను సేవ్ చేసిన బాబాబాస్కర్
- సోమవారం బిగ్ బాస్ ఇంటిలో నామినేషన్ పక్రియ కొనసాగింది
- ఇంటి కెప్టెన్ బాబాబాస్కర్ ను నామినేషన్స్ నుంచి మినహాయించారు
- ఎలిమినేషన్ లో భాగంగా ఇంటిలో ఉన్న 11 మంది సభ్యులను రెండు గ్రూపులుగా విడగొట్టారు
- మొదటి గ్రూప్ లో రాహుల్, వరుణ్ సందేశ్, వితికా, శిల్పా చక్రవర్తి, పునర్నవి ఉన్నారు
- రెండవ గ్రూప్ లో శ్రీముఖి, రవికృష్ణ,శివజ్యోతి, హిమజ, మహేష్ ఉన్నారు
- మొదటి గ్రూప్ సభ్యులు ఒక్కొక్కరిగా రెండవ గ్రూప్ లో ఉన్న ఇద్దరి సభ్యుల ఫోటోలు మంటల్లో కాల్చి నామినేట్ చేసి రీజన్ చెప్పాలని బిగ్ బాస్ చెప్తాడు, అదేవిధంగా రెండవ గ్రూప్ సభ్యులు కూడా ఒక్కొక్కరిగా మొదటి గ్రూప్ లో ఉన్న ఇద్దరి సభ్యుల ఫోటోలు మంటల్లో కాల్చి నామినేట్ చేయమని బిగ్ బాస్ కోరతాడు
నామినేషన్స్ ఈ విధముగా కొనసాగాయి:
- రవికృష్ణ- రాహుల్, శిల్పా చక్రవర్తి లను నామినేట్ చేసాడు
- పునర్నవి- మహేష్, శ్రీముఖి లను నామినేట్ చేసింది
- శివజ్యోతి- పునర్నవి, శిల్పా చక్రవర్తి లను నామినేట్ చేసింది
- శిల్పా చక్రవర్తి- శివజ్యోతి, హిమజ లను నామినేట్ చేసింది
- శ్రీముఖి- పునర్నవి, శిల్పా చక్రవర్తి లను నామినేట్ చేసింది
- వితికా షెరు-మహేష్ విట్టా, రవికృష్ణ లను నామినేట్ చేసింది
- హిమజ- శిల్పా చక్రవర్తి, వితికా షెరు లను నామినేట్ చేసింది
- వరుణ్- మహేష్ విట్టా, హిమజ లను నామినేట్ చేసాడు
- రాహుల్- హిమజ, శ్రీముఖి లను నామినేట్ చేసాడు
- మహేష్ విట్టా- పునర్నవి, వరుణ్ సందేశ్ లను నామినేట్ చేసాడు
- ఈ ప్రక్రియలో ఎక్కువ ఓట్లు రావడంతో మహేష్ విట్టా, రవికృష్ణ, శ్రీముఖి, పునర్నవి,శిల్పా చక్రవర్తి, హిమజ నామినేట్ అయ్యారు
- అయితే నామినేట్ అయిన ఆరుగురు నుంచి ఒకరిని సేవ్ చేసే ప్రత్యేక అధికారాన్ని బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ అయిన బాబాబాస్కర్ కు ఇచ్చాడు
- గతవారం ఇచ్చిన టాస్క్ లో రవికృష్ణ చాలా బాగా ఆడాడు అని, అందుకే సేవ్ చేస్తునట్టు బాబాబాస్కర్ ప్రకటించాడు
- రవికృష్ణ సేవ్ అవ్వడంతో ఎలిమినేషన్ ప్రాసెస్ లో శిల్పా చక్రవర్తి, శ్రీముఖి, పునర్నవి, మహేష్ విట్టా, హిమజ ఉన్నారు.