తెలుగు సినిమా పరిశ్రమలో జూలై 18 మొదలుకొని, ఆగస్ట్ 30 వరకు 12 సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంది, రాబోయే 40 రోజుల్లో ఈ చిత్రాలు ప్రేక్షకులను కనువిందు చేయనున్నాయి. డిఫరెంట్ జోనర్స్ తో నిర్మించబడ్డ ఈ చిత్రాలు వరుసగా విడుదలై సందడి చేయబోతున్నాయి. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా రూపొందిన ‘ ఇస్మార్ట్ శంకర్ ‘ చిత్రం జూలై 18 న విడుదలవుతుంది, అదే విధంగా భరత్ కమ్మ దర్శకత్వంలో యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన నటించిన ‘ డియర్ కామ్రేడ్ ‘ చిత్రం జూలై 26 న ప్రేక్షకులముందుకు రాబోతుంది. హీరో కార్తికేయ కొత్త చిత్రం ‘ గుణ 369 ‘ ఆగస్ట్ 2 న రిలీజ్ కానుంది.
ఇక అక్కినేని నాగార్జున,రకుల్ ప్రీత్ జంటగా నటించగా, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ‘ మన్మథుడు 2 ‘ చిత్రం ఆగస్ట్ 9 న విడుదల కానుంది. శర్వానంద్, సుధీర్ వర్మ కాంబినేషన్లో వస్తున్న ‘ రణరంగం ‘, అడవి శేష్ ‘ఎవరు’ చిత్రాలు ఆగస్టు 15 న విడుదల చేస్తునట్టు ప్రకటించారు. ఐశ్వర్య రాజేష్, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించగా, భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన ‘ కౌసల్య కృష్ణమూర్తి ‘ ఆగస్ట్ 23 న రిలీజ్ కానుంది మరియు నేచురల్ స్టార్ నాని ‘ గ్యాంగ్ లీడర్ ‘ సినిమా ఆగష్టు 30 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధమవుతోంది. ఇవిగాక ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘ సాహో ‘, బెల్లంకొండ శ్రీనివాస్ ‘ రాక్షసుడు ‘ చిత్రాలు కూడ ఆగస్ట్ నెలలోనే విడుదల కానున్నాయి.
అంతే కాకుండా స్టార్ హీరో అజిత్ నటించిన ‘నేర్కొండ పార్వై ‘, చియాన్ విక్రమ్ నటించిన ‘ మిస్టర్ కే కే ‘ డబ్బింగ్ వెర్షన్స్ కూడ ఆగస్ట్ నెలలోనే విడుదల అవుతున్నాయి. వరుస సినిమాల నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద సందడి నెలకొననుంది, కొన్ని చిత్రాలపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.