దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజు రోజుకి విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా నిర్ధారణ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) దేశంలో మరో పది ప్రైవేటు ల్యాబ్లకు అనుమతి ఇచ్చింది. దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల కోసం మొత్తం 116 కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో ముందుగా 6 ప్రైవేటు ల్యాబ్లకు కూడా ఇటీవలే కరోనా పరీక్షలు చేసేందుకు అనుమతినిచ్చారు. కొత్తగా 60 ప్రైవేట్ లాబ్స్ అనుమతికోసం సంప్రదించగా మరో 10లాబ్స్ కు అనుమతిస్తూ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో 3, గుజరాత్లో 2, హర్యానాలో 2, కర్ణాటకలో 1, మహారాష్ట్ర 5, తమిళనాడులో 2 , తెలంగాణాలో 1 (జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్) ల్యాబ్ కు అనుమతి లభించింది.
ఈ నేపథ్యంలో కోవిడ్-19 నిర్ధారణ పరీక్షల కోసం కేవలం రూ.4,500 మాత్రమే వసూలు చేయాలనీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో స్క్రీనింగ్ పరీక్ష కోసం రూ.1500, నిర్ధారణ పరీక్ష కోసం రూ.3,000 వసూలు చేయాలనీ ప్రకటించారు. ఈ నిబంధనను అతిక్రమించిన ల్యాబ్ లపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని కూడా కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. దేశంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 500 కు చేరుకోగా, మరణించిన వారి సంఖ్య 10 కి చేరింది.