టాలీవుడ్ హీరో, నిర్మాత యాదా కృష్ణ కన్నుమూశారు. ఆయన వయసు 61 సంవత్సరాలు. బుధవారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. యాదాకృష్ణ 20 కి పైగా తెలుగు చిత్రాల్లో నటించారు. హీరోగానే కాకుండా పలు సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. ‘సంక్రాంతి అల్లుడు’ అనే సినిమాలో ఆయన చివరిసారిగా నటించారు. గుప్త శాస్త్రం, పిక్నిక్ వంటి చిత్రాలతో గుర్తింపు పొందారు. కొంతకాలం నుంచి ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. యాదా కృష్ణ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ