కరోనా మహమ్మారి.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఎవరినీ వదలటం లేదు. ఇప్పటికే ఎంతోమంది సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వైరస్ బారిన పడి చికిత్స హోం ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నారు. సినిమా పరిశ్రమను నీడలా వెంటాడుతోంది కరోనా. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్.. ఇలా ఏ సినిమా పరిశ్రమ వారినీ వదిలిపెట్టడం లేదు. తాజాగా ప్రముఖ టాలీవుడ్ సింగర్ కౌసల్య కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
‘నాకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం నాకు లక్షణాలు తీవ్రంగా ఉన్నాయి. రెండు రోజుల నుంచి జ్వరంగా ఉంది. కనీసం బెడ్పై నుంచి కూడా లేవలేకపోతున్నాను. ఇప్పుడు గొంతు నొప్పి కూడా ఇబ్బంది పెడుతోంది. నిన్నటి నుంచి మందులు తీసుకోవడం మొదలుపెట్టాను. త్వరలోనే ఈ వైరస్ ను ఓడించి మీ ముందుకు వస్తాను. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి’ అని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు కౌసల్య.
అయితే, ఈ విషయం తెలుసుకున్న కౌసల్య శ్రేయోభిలాషులు, సినీ ప్రముఖులు, ఆమె అభిమానులు.. కౌసల్య త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షిస్తున్నారు. ‘టేక్ కేర్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. టాలీవుడ్ లో తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇంకా హీరో శ్రీకాంత్, యానీ మాస్టర్ తదితరులు కూడా ఈ వైరస్ బారిన పడ్డారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ