ప్రస్తుతం దేశంలో కరోనా మూడోదశ మొదలయింది. ఇన్నాళ్లుగా పెద్దలను మాత్రమే ఒణికించిన కరోనా ఇప్పుడు పిల్లలపై కూడా ప్రభావం చూపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యంగా కేసులు పెరుగుతున్నాయి. అమెరికాలో అయితే 30 శాతం మంది పిల్లలు ఒమిక్రాన్ బారిన పడుతున్నారు. మన వద్ద కూడా పిల్లల్లో కేసులు నమోదవుతున్నాయి. డెల్టా వేరియంట్ లో కనిపించే లక్షణాలతోపాటు ఒకటి రెండు కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. కొందరు చిన్నారులకు కడుపు నొప్పి, వాంతులు అవుతున్నాయి. జ్వరం, ఇతర సమస్యలు తక్కువగా కనిపిస్తున్నాయి. చాలామంది తల్లిదండ్రులు దీనిని అజీర్ణ సమస్యగా భావిస్తున్నారు. ప్రాథమిక వైద్యంతో కొందరిలో తగ్గిపోతోంది. మరికొందరు మాత్రం వైద్యులను సంప్రదిస్తున్నారు. పరీక్షలు చేస్తే కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవుతోంది.
డెల్టా వేరియంట్లో పిల్లల్లో కడుపు నొప్పి కనిపించేది కాదని, వాంతులు, విరోచనాలు, దగ్గు, ఆయాసం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది.. ఇలాంటి సమస్యలు ఉండేవని వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రి పిల్లల వార్డులో ఐదుగురు పిల్లలు కరోనాకు చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరికి ఆక్సిజన్ తో చికిత్స అందిస్తున్నారు. అయితే, అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం పిల్లల్లో 101-102 డిగ్రీల జ్వరం, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కరోనా పరీక్షలు చేయించాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా.. 5 సంవత్సరాలలోపు పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ