ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. కరోనా కొత్త వైరస్ ఒమిక్రాన్ అన్ని దేశాలలో తన ప్రభావాన్ని చూపుతోంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరికి వ్యాపిస్తోంది. దీనికి ఎవరూ మినహాయింపు కాదు. తాజాగా, తమిళ సీనియర్ నటుడు, స్టార్ కమెడియన్ వడివేలు కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. ఇటీవలే ఓ సినిమా కోసం లండన్ వెళ్లిన ఆయన, షూటింగ్ పూర్తి చేసుకుని మూడు రోజుల కిందట ఇండియా వచ్చారు. అయితే, ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో.. టెస్టులు చేయించుకోగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో వడివేలును చికిత్స నిమిత్తం పోరూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే వడివేలు లండన్ నుంచి రావడంతో అప్రమత్తమైన అధికారులు ఒమిక్రాన్ పరీక్షల నిమిత్తం శాంపిల్ ను జీనోమ్ ల్యాబ్ కి పంపించారు. శనివారం నాడు ఒమిక్రాన్ రిపోర్టులు వస్తాయని అధికారులు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ