ప్రస్తుత ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కోవిడ్-19(కరోనా వైరస్) వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ లో కూడా రోజురోజుకి కరోనా వైరస్ క్రమంగా వ్యాప్తి చెందుతుంది. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ విధించడంతో పాటుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే దేశంలో ఇప్పటికే 2300 కు పైగా కేసులు నమోదు కాగా, ఈ వైరస్ వలన 56 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే ఈ వైరస్ తో పోరాడి 157 మంది కోలుకుని డిశ్చార్జ్ అయినట్టుగా తెలిపారు. మరోవైపు పలు రాష్ట్రాల్లో 100 కు పైగా కేసులు నమోదయ్యాయి.
దేశంలో 100 కు పైగా కరోనా కేసులు నమోదైన రాష్ట్రాలు:
- మహారాష్ట్ర : 423
- తమిళనాడు : 309
- ఢిల్లీ : 293
- కేరళ : 286
- ఉత్తరప్రదేశ్ : 172
- ఆంధ్రప్రదేశ్ : 161
- తెలంగాణ : 154
- రాజస్థాన్ : 154
- కర్ణాటక : 125
- మధ్యప్రదేశ్ : 107
[subscribe]