దేశవ్యాప్తంగా రోజువారీగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.21 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో కొత్తగా 1,033 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఏప్రిల్ 7, గురువారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,31,958 కు చేరుకుంది. గత 24 గంటల్లో మరో 43 కరోనా మరణాలు నమోదవడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,21,530కి పెరిగింది. ముఖ్యంగా కేరళ, ఢిల్లీ, మహారాష్ట్ర, మిజోరాం, హర్యానా, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.
దేశంలో 11,639 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.76 శాతం:
దేశంలో ప్రస్తుతం 11,639(0.03%) యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 1,222 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,24,98,789 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.76 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.21 శాతంగా ఉంది. అలాగే ఏప్రిల్ 6, బుధవారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 79,25,09,451 కు చేరుకుంది. ఏప్రిల్ 6న 4,82,039 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ