సిక్కింలో ఘోరం చోటుచేసుకుంది. శుక్రవారం నాడు ఉత్తర సిక్కింలోని భారత్-చైనా సరిహద్దు సమీపంలో లాచెన్ పట్టణంలో ఇండియన్ ఆర్మీ వాహనం పెద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 16 మంది భారతీయ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరో నలుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఆర్మీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన సైనికులను హెలికాఫ్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. దీనిపై ఆర్మీ ఉన్నతాధికారులు స్పందిస్తూ.. చట్టెన్ నుండి థంగు లోని బోర్డర్ పోస్టుల వైపుకు వెళుతున్న 3 వాహనాల కాన్వాయ్లో ఒక వాహనం మలుపు తిరుగుతుండగా అదుపు తప్పి వందల అడుగుల లోతున్న లోయలోకి నిట్టనిలువుగా జారిపడిందని తెలిపారు. ఈ ఘటన సమయంలో ట్రక్కులో సుమారు 20మంది వరకు ఉన్నారని, ప్రమాద స్థలంలో 16 మృతదేహాలను గుర్తించామని, గాయపడ్డ మరో నలుగురిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. వీరమరణం పొందిన వారిలో ముగ్గురు జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్లు మరియు 13 మంది సైనికులు ఉన్నారని వివరించారు.
Deeply pained by the loss of lives of the Indian Army personnel due to a road accident in North Sikkim.
The nation is deeply grateful for their service and commitment. My condolences to the bereaved families. Praying for the speedy recovery of those who are injured.
— Rajnath Singh (@rajnathsingh) December 23, 2022
కాగా సిక్కిం ప్రమాద ఘటనపై భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమన్న మంత్రి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉత్తర సిక్కింలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని, వారి సేవ మరియు నిబద్ధతకు దేశం ఎంతో కృతజ్ఞతలు తెలుపుతోందని పేర్కొన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని రాజ్నాథ్ సింగ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ