ఢిల్లీలో 19 సంవత్సరాల పిజ్జా డెలివరీ బాయ్కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావటంతో ఒక్కసారిగా కలకలం రేగి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో అతనితో తిరిగిన 20 మంది డెలివరీ బాయ్స్ ను క్వారంటైన్ కు తరలించామని, అలాగే అతను పిజ్జా డెలివరీ చేసిన 72 కుటుంబాలను కూడా క్వారంటైన్ కేంద్రాలకు తరలించినట్టు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. ఏప్రిల్ 12, ఆదివారం వరకు విధుల్లో ఉన్న ఆ యువకుడు అనారోగ్యం పాలు కావటంతో ఆర్ఎంఎల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతనికి కరోనా నిర్ధారణ కావడంతో గత 15 రోజులుగా డెలివరీలు చేసిన హౌజ్ ఖాస్, మాలవీయ నగర్, సావిత్రి నగర్ తదితర ప్రాంతాల్లోని 72 కుటుంబాలను కూడా క్వారంటైన్ కేంద్రాలకు తరలించి, వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. వీరికి లక్షణాలను బట్టి వచ్చే రెండు మూడు రోజుల్లో కరోనా వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు.
అలాగే ఆ యువకుడితో కలసి పనిచేసిన మరో 20 డెలివరీ ఉద్యోగులను కూడా క్వారంటైన్లో ఉంచినట్టు అధికారులు తెలిపారు. ఇక ఈ యువకుడుకి ఎలాంటి విదేశీ ప్రయాణం నేపధ్యం లేదని, డెలివరీ అందించే క్రమంలోనే ఎవరో ఒకరి నుంచి అతనికి కరోనా సోకి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఢిల్లీలో ఇప్పటి వరకు 1,578 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, ఈ వైరస్ వలన 30 మంది మరణించారు. ఈ రోజు ఘటనతో కరోనా కేసులు మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]