అగ్రరాజ్యం అమెరికా కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావంతో విలవిలలాడుతోంది. ప్రభుత్వం కరోనా కట్టడికి పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా న్యూయార్క్, న్యూజెర్సీ, మిచిగాన్ రాష్ట్రాల్లో కరోనా ప్రభావం ఎక్కువుగా ఉంది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ తాజా సమాచారం ప్రకారం గత 24 గంటల్లోనే అమెరికాలో కరోనా వైరస్ వలన 2,100 మంది మరణించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం మొదలయ్యాక అమెరికాలో ఇంతమంది మరణించడం ఇదే తొలిసారి. నిన్న ఒక్క రోజే న్యూయార్క్ లో 777, న్యూజెర్సీలో 232, మిచిగాన్ లో 205 మంది మరణించారు. దీంతో అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 18,637 కు చేరింది. మరోవైపు కరోనా బాధితుల సంఖ్య 5,00,000 దాటింది.
తాజా పరిసితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, వైరస్ కట్టడికి ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు చేపడతుందని చెప్పారు. అలాగే దేశంలో ఆంక్షలు ఎత్తివేసే విషయంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు కరోనా వలన పెద్దసంఖ్యలో మరణాలు నమోదు అవ్వడం, ఇంకోవైపు అమెరికా మొత్తం జనాభాలో దాదాపు 95 శాతం మంది ఆంక్షల పరిధిలో ఉండడంపై ట్రంప్ స్పందిస్తూ, ఆంక్షల్ని ఎప్పుడు ఎత్తివేయాలన్నది సవాల్గా మారిందని, ఇప్పటి వరకు తన జీవితంలో తీసుకున్న నిర్ణయాల్లో ఇదే అతిపెద్ద నిర్ణయం కాబోతోందని వ్యాఖ్యానించారు. ఆర్థిక నిపుణులు, సలహాదారులును సంప్రదించి సరైన నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu