2023 జనవరి నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను నేడు (డిసెంబర్ 12, సోమవారం) మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. అదేవిధంగా 2023 జనవరి నెలకు సంబంధించి మరికొన్ని ఆర్జితసేవా టికెట్లకు ఆన్లైన్ లక్కీడిప్ నమోదు ప్రక్రియ డిసెంబర్ 12న ఉదయం 10 గంటల నుండి డిసెంబరు 14న ఉదయం 10 గంటల వరకు ఉంటుందని, ఆ తరువాత లక్కీడిప్ లో టికెట్లు కేటాయిస్తామని టీటీడీ పేర్కొంది.
మరోవైపు డిసెంబర్ 16 మరియు 31వ తేదీల్లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల ఆన్లైన్ కోటాను డిసెంబర్ 13వ తేదీ ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్సైట్లో విడుదల చేయనున్నట్టు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి తదనుగుణంగా టిక్కెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE