దేశంలో రోజువారీ కరోనా కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. వరుసగా 21 రోజులుగా లక్ష కంటే తక్కువుగా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా, వరుసగా 46వ రోజు కూడా రోజువారీ పాజిటివ్ కేసులు కంటే రికవరీలు ఎక్కువుగా ఉన్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 46,148 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 3,02,79,331 కు చేరుకుంది. కరోనాకు చికిత్స పొందుతూ మరో 979 మంది మరణించడంతో మరణాల సంఖ్య 3,96,730 కి పెరిగింది. ప్రస్తుతం 5,72,994 (1.89%) మంది కరోనా బాధితులు హోం ఐసోలేషన్ లలో, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కొత్తగా కేరళ (10,905), మహారాష్ట్ర (9,974), తమిళనాడు (5,127), ఆంధ్రప్రదేశ్ (4,250), కర్ణాటక (3,604), ఒడిశా (3,408), వెస్ట్ బెంగాల్ (1,836), అస్సాం (1,523), తెలంగాణ (748), పంజాబ్ (297) వంటి 10 రాష్ట్రాల్లోనే కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. ఇక దేశంలో మరో 58,578 మంది బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి సంఖ్య 2,93,09,607 కు చేరుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ